నరుకూరులో గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-24T04:23:50+05:30 IST

మండలంలోని నరుకూరులో ఇందుకూరుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు శుక్రవారం నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

నరుకూరులో గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
నిందితుడు నిరంజన్‌ నుంచి స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు

తోటపల్లిగూడూరు, ఏప్రిల్‌ 23 : మండలంలోని నరుకూరులో ఇందుకూరుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు శుక్రవారం నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన ఎం.నిరంజన్‌ నివాసంలో వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఇన్‌స్పెక్టర్‌ కేపీ కిషోర్‌ తెలిపారు. ఈ దాడిలో సుమారు రూ.30వేల విలువైన 3,158 ఐదు రకాల గుట్కా ప్యాకెట్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడుల్లో హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.కిరణ్‌సింగ్‌, కానిస్టేబుల్‌ బలవర్థన్‌  పాల్గొన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

Updated Date - 2021-04-24T04:23:50+05:30 IST