పత్తి పొలంలో గుట్కా ప్యాకెట్లు
ABN , First Publish Date - 2021-01-22T06:29:46+05:30 IST
కంచికచర్లలోని చెవిటికల్లు రోడ్డులో పత్తి పొలంలో నిల్వ ఉంచిన రూ. రెండు లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు నందిగామ రూరల్ సీఐ సతీష్ తెలిపారు.
రూ.2లక్షల సరుకు స్వాధీనం
కంచికచర్ల రూరల్ : కంచికచర్లలోని చెవిటికల్లు రోడ్డులో పత్తి పొలంలో నిల్వ ఉంచిన రూ. రెండు లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు నందిగామ రూరల్ సీఐ సతీష్ తెలిపారు. గుట్కా నిల్వ చేశారనే సమాచారంతో గురువారం తెల్ల వారుజామున కంచికచర్ల, వీరులపాడు ఎస్సై రంగనాథ్, మణికుమార్, సిబ్బందితో కలిసి దాడి చేసినట్టు తెలిపారు. జీ కొండూరు మండలం కవులూరుకు చెందిన కమలాకరరావు, వంకదారి వెంకటేశ్వరరావులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గుట్కా ప్యాకెట్లు, పావుకిలో గంజాయి, బైకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సిబ్బందికి రివార్డు అందజేసినట్టు సీఐ తెలిపారు.