అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కలలుకంటోంది..: గుత్తా సుఖేందర్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-20T16:11:59+05:30 IST

కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జానారెడ్డిలు టీఆర్ఎస్ పాలనను విమర్శించడం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కలలుకంటోంది..: గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా: మిర్యాలగూడ కాంగ్రెస్ సభలో ఆ పార్టీ నేతలు ఉత్తమ్, జానారెడ్డిలు టీఆర్ఎస్ పాలనను విమర్శించడం సరికాదని టీఆర్ఎస్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారని, రాదన్న విషయం వారికీ తెలుసునని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు ఇతర పార్టీలకు వెళ్లకుండా కాపాడుకునేందుకే టీఆర్ఎస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తన్నుకోవడంలోనే వారి పరిస్థితి ఏమిటో తెలుస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియోజకవర్గంలోనే గుండు పగిలే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంక్షేమ పాలన టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-01-20T16:11:59+05:30 IST