Gutta Sukhender Reddy: 1999లో ఇద్దరం ఎంపీలుగా ఉన్నాం..
ABN , First Publish Date - 2022-09-11T16:45:47+05:30 IST
కృష్ణం రాజు మృతి పట్ల తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్ (Hyderabad): తెలుగు సినీ హీరో, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు (Krishnam Raju) మృతి పట్ల తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) సంతాపం ప్రకటించారు. తన విలక్షణ నటనాశైలితో రెబల్ స్టార్గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారని కొనియాడారు. కృష్ణంరాజు మరణం, తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్నారు. 1999లో ఇద్దరం ఎంపీలుగా ఉన్నామని... కలుసుకున్న ప్రతిసారి ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని గుర్తుచేసుకున్నారు. కృష్ణం రాజు ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్ధిస్తున్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.