TS News: నూతన మండలంగా గట్టుప్పల్
ABN , First Publish Date - 2022-07-23T01:15:47+05:30 IST
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గట్టుప్పల్ని మండలంగా ప్రకటించాలని కొన్నేళ్లుగా ప్రజలు, నాయకులు ధర్నాలు చేస్తున్నారు.
యాదాద్రి(Yadadri): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గట్టుప్పల్(Guttuppal)ని మండలంగా ప్రకటించాలని కొన్నేళ్లుగా ప్రజలు, నాయకులు ధర్నాలు చేస్తున్నారు. మండలంగా ప్రకటిస్తే మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చని పలుమార్లు ప్రభుత్వానికి పలు వినతులు కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం ప్రజల అభ్యర్థనను అర్ధం చేసుకుని నూతన మండలంగా గట్టుప్పల్ని ప్రకటించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికాసేపట్లో జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏడేళ్ల క్రితమే గట్టుప్పల్ని మండలంగా ప్రకటించే ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏడేళ్లుగా గ్రామస్తులు ఉద్యమం చేస్తున్నారు. ఎట్టకేలకు మంత్రి జగదీష్రెడ్డి చొరవతో గ్రామస్తుల కల నెరవేరనుంది.ప్రభుత్వం గట్టుప్పల్ని నూతన మండలంగా ప్రకటిస్తుడడంతో గట్టుప్పల్ గ్రామస్తులు సంబురాలు చేసుకుంటున్నారు.