పీకే ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు: గువ్వల బాలరాజు

ABN , First Publish Date - 2022-04-27T00:16:23+05:30 IST

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పిచ్చి పట్టిన కుక్క లెక్క పాదయాత్ర చేస్తున్నాడని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.

పీకే ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు: గువ్వల బాలరాజు

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పిచ్చి పట్టిన కుక్క లెక్క పాదయాత్ర చేస్తున్నాడని  ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీకి అభివృద్ధి పట్టదు. బీజేపీ నాయకులు రాజకీయ కోణంలోనే వ్యవహరిస్తున్నారు.దళితబంధు దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు. మత, కులాల మధ్య చిచ్చు రేపి ఓట్లు దండుకునే కుట్రకు తెరలేపారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం శ్రేయస్కరం కాదు. తెలంగాణ సమాజం ఇవన్నీ తిప్పికొడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 80 వేలకు పైగా నోటిఫికేషన్ ఇస్తే దానిని వక్రీకరించి మాట్లాడుతున్నారు.తెలంగాణ పథకాలు దేశం మొత్తం వ్యాప్తం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం అడ్డుకుంటుంది. ఈ బీజేపీ పార్టీని గద్దెదించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాడుతాం. కేసీఆర్ చేసే పోరాటానికి యావత్ భారతదేశ ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మేధావి.రేవంత్‌రెడ్డికి పీసీసీ పదవికి అనర్హడు. 2014, 2018లో రెండుసార్లు అధికారంలోకి వచ్చాం. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి చూపిస్తాం...రేపటి ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం పిలిపిచ్చిన తూచా తప్పకుండా పాటిస్తాం.. పీకే కాంగ్రెస్ పార్టీ ఆఫర్‌ను తిరస్కరించాడు. టీఆర్ఎస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు. సింగిల్ గానే పోటీ చేస్తాం.. అధికారంలోకి వస్తాం. మాకు ప్రజలే బాస్’’ అని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-27T00:16:23+05:30 IST