BJP అధికారంలోకి వస్తేనే AP అభివృద్ధి సాధ్యం: GVL

ABN , First Publish Date - 2022-06-06T19:56:17+05:30 IST

APలో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమవుతుందని ఎంపీ జీవీఎల్ అన్నారు.

BJP అధికారంలోకి వస్తేనే AP అభివృద్ధి సాధ్యం: GVL

Vijayawada: APలో బీజేపీ (BJP) అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమవుతుందని ఎంపీ జీవీఎల్ (GVL) నరసింహారావు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. వారి సొంత అజెండా తప్పితే రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీని బలీయమైన శక్తిగా నిర్మించాలన్న కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా రెండు రోజులపాటు ఉంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టాలనే తీవ్రమైన సంకల్పం జాతీయ నాయకత్వంలో నెలకొందన్నారు. బీజేపీ, జనసేన కలిసి 2014 ఎన్నికల్లో పోటీ చేస్తాయని, అధికారంలోకి రావాలన్నదే తమ ఆలోచన అని, ఆ ప్రకారమే కార్యాచరణ సిద్ధం చేసి ముందుకు వెళతామని చెప్పారు. సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని జీవీఎల్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-06T19:56:17+05:30 IST