ఓటర్ల స్లిప్ల పంపిణీలో జాగ్రత్తలు అవసరం
ABN , First Publish Date - 2021-03-02T06:31:34+05:30 IST
జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఇంటింటికీ ఓటర్లు స్లిప్లు పంపిణీకి సంబంధించి సోమవారం బీఎల్వోలతో జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ సమీక్ష నిర్వహించారు
గాజువాక, మార్చి 1: జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఇంటింటికీ ఓటర్లు స్లిప్లు పంపిణీకి సంబంధించి సోమవారం బీఎల్వోలతో జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. ఓటర్ల స్లిప్ల పంపిణీలో తీసుకోవలసిన విధి విధానాలను వివరించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాను అనుసరించి ఓటర్ల స్లిప్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. సంబంధిత డోర్ నంబర్లలో ఓటర్లు లేకపోతే వారు ఎక్కడ ఉన్నారో గుర్తించి స్లిప్లు అందజేయాలన్నారు. చనిపోయిన వారిని గుర్తించి సమాచారాన్ని అధికారులకు తెలిపాలన్నారు. ఓటర్ల జాబితాలో ఏమైనా లోపాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో రిటర్నింగ్ అధికారులు సత్యనారాయణమూర్తి, రహీం, విజయశ్రీ, రమణమూర్తి, వాసు, విజయ్కుమార్ పాల్గొన్నారు.