గాజువాకలో శ్రీరాముని శోభాయాత్ర

ABN , First Publish Date - 2021-01-25T06:36:00+05:30 IST

గాజువాకలో ఆదివారం శ్రీరాముని శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. గాజువాకలో ప్రారంభమైన యాత్రలో శ్రీమఠం పిఠాఽధిపతి పరిపూర్ణానంద స్వామి హాజరై మాట్లాడారు.

గాజువాకలో శ్రీరాముని శోభాయాత్ర
మాట్లాడుతున్న శ్రీమఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి

ఉక్కుటౌన్‌షిప్‌: గాజువాకలో ఆదివారం శ్రీరాముని శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. గాజువాకలో ప్రారంభమైన యాత్రలో శ్రీమఠం పిఠాఽధిపతి  పరిపూర్ణానంద స్వామి హాజరై మాట్లాడారు. అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశ్వహిందూపరిషత్‌, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం గాజువాకలోని పలు ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టారు. బీజేపీ కన్వీనర్‌ కరణంరెడ్డి నరసింగరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి,  శంకరరావు, బాటా శ్రీను, సిరసపల్లి నూకరాజు, పల్లా శంకరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-25T06:36:00+05:30 IST