ఈ ఏడాదీ హజ్ యాత్ర లేదు !
ABN , First Publish Date - 2021-06-16T14:14:00+05:30 IST
వరుసగా రెండో ఏడాది కూడా భారత్ నుంచి హజ్ యాత్ర రద్దయింది. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం అందిన దరఖాస్తులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారత హజ్ కమిటీ మంగళవారం ప్రకటించింది.
హజ్ యాత్ర దరఖాస్తులన్నీ రద్దు!
న్యూఢిల్లీ /హైదరాబాద్: వరుసగా రెండో ఏడాది కూడా భారత్ నుంచి హజ్ యాత్ర రద్దయింది. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం అందిన దరఖాస్తులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారత హజ్ కమిటీ మంగళవారం ప్రకటించింది. కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నందున పరిమిత సంఖ్యలో స్థానికులను తప్ప, విదేశీ యాత్రికులను హజ్కు అనుమతించడం లేదని సౌదీ అరేబియా ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది. గతేడాది కూడా కరోనా కారణంగా సౌదీ అరేబియా విదేశీ యాత్రికులకు అనుమతించడం లేదని ప్రకటించడంతో భారత ప్రభుత్వం హజ్ యాత్రను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా, భారత హజ్ కమిటీ నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో ఈ ఏడాది హజ్ యాత్రకు స్వీకరించిన 3757 దరఖాస్తులను రద్దు చేస్తున్నామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ తెలిపింది.