స్మార్ట్ కార్డు ఉంటేనే హజ్ యాత్ర
ABN , First Publish Date - 2021-06-19T15:21:55+05:30 IST
కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియా ఈసారి కూడా దేశ పౌరులు, నివాసితులకు మాత్రమే హజ్ యాత్రకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అది కూడా 60వేల మందికి మాత్రమే యాత్రకు అవకాశం కల్పించింది.
జెడ్డా: కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియా ఈసారి కూడా దేశ పౌరులు, నివాసితులకు మాత్రమే హజ్ యాత్రకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అది కూడా 60వేల మందికి మాత్రమే యాత్రకు అవకాశం కల్పించింది. దీంతో విదేశీయులకు ఈ ఏడాది కూడా నిరాశే ఎదురైంది. ఇదిలాఉంటే.. హజ్కు అనుమతించిన యాత్రికుల విషయంలో తాజాగా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ కార్డు లేని యాత్రికులను ఎట్టిపరిస్థితుల్లో యాత్రకు అనుమతించబోమని స్పష్టం చేసింది. అలాగే పర్మిట్ ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ కార్డు అలాగే యాత్రికుల ఐడీతో మ్యాచ్ అవ్వాలని పేర్కొంది. పర్మిట్ కోసం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాష్తు చేసుకోవాలని ఈ సందర్భంగా డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా డా. అబ్దుల్ఫత్హా మషత్ వెల్లడించారు. బయటి ఇతర కంపెనీలు ఆఫర్ చేసే ప్యాకేజీల ద్వారా యాత్రకు వస్తే అది నిబంధనల ఉల్లంఘనల కిందకి వస్తుందని మంత్రి తెలిపారు.