సాయిబాబా ఆలయంలో హంపి పీఠాధిపతి పూజలు
ABN , First Publish Date - 2022-07-06T07:03:21+05:30 IST
స్థానిక గండిరామన్న దత్తసాయి ఆలయంలో మంగళవారం హంపి పీఠాధిపతి శంకరాచార్యులు పూజలు చేశారు.
నిర్మల్ కల్చరల్, జూలై 5 : స్థానిక గండిరామన్న దత్తసాయి ఆలయంలో మంగళవారం హంపి పీఠాధిపతి శంకరాచార్యులు పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు జరిపారు. ఆలయ సింగల్ ట్రస్ట్ చైర్మన్ లక్కిడి జగన్మోహన్రెడ్డి ఆయనను సన్మానించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా శంకరాచార్యులు తమ సందేశంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలన్నారు. సాయిబాబా ఆలయంలో ఎంతో ప్రశాంతత లభిస్తుందన్నారు. సాయి దర్శనంతో సకల పాపాలు తొలగిపోతాయన్నారు. భక్తులు శంకరాచార్యులను దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు.