హ్యాండ్‌ శానిటైజర్‌ స్టాండ్‌ వ్యాన్‌ను ప్రారంభించిన సీపీ

ABN , First Publish Date - 2020-08-06T18:12:14+05:30 IST

కొవిడ్‌-19 దృష్ట్యా ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, కలెక్టరేట్‌, ఆర్టీఏ, ప్రభుత్వ కార్యాలయాలకు హ్యాండ్‌ శానిటైజర్‌ స్టాండ్‌ అందజే సేందుకు రోటరీ సర్వీస్‌ ట్రస్ట్‌,

హ్యాండ్‌ శానిటైజర్‌ స్టాండ్‌ వ్యాన్‌ను ప్రారంభించిన సీపీ

నిజామాబాద్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 దృష్ట్యా ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, కలెక్టరేట్‌, ఆర్టీఏ, ప్రభుత్వ కార్యాలయాలకు హ్యాండ్‌ శానిటైజర్‌ స్టాండ్‌ అందజే సేందుకు రోటరీ సర్వీస్‌ ట్రస్ట్‌, యు.వి. సంయుక్త ఆధ్వర్యంలో వ్యాన్‌ను సీపీ కార్తికేయ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ కార్తికేయ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ట్రస్ట్‌ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని అన్నారు. రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు దర్శన్‌సింగ్‌ శోకి మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయలు, మసీదులు, చర్చిలకు నిత్యం ప్రజలు వెళుతుంటారని, ఆ ప్రదేశాల్లో శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో శానిటైజర్‌ స్టాండును అందజేశామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి బాబూరావు, ఎన్‌ ఆర్‌ఎస్‌టీ చైర్మన్‌ డాక్టర్‌ జి.కౌలయ్య, కార్యదర్శి జగదీశ్వర్‌రావు, సభ్యులు అశోక్‌, జ్ఞానప్రకాష్‌, మహేందర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-08-06T18:12:14+05:30 IST