మూసీ ప్రక్షాళనపై చేతలు కావాలి : సీపీఎం

ABN , First Publish Date - 2022-08-09T05:37:42+05:30 IST

మూసీనది ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ అన్నారు.

మూసీ ప్రక్షాళనపై చేతలు కావాలి : సీపీఎం
భువనగిరిలో పోరుయాత్ర వాల్‌రైటింగ్‌ను పరిశీలిస్తున్న నాయకులు


భువనగిరి టౌన, ఆగస్టు 8 : మూసీనది ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ అన్నారు. భువనగిరిలో సోమవారం నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళన డిమాండ్‌తో ఈ నెల 21 నుంచి జిల్లాలోని గ్రామ గ్రామాన సీపీఎం పోరుయాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మూసీ నది ప్రక్షాళనపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు పరస్పరం ఆరోపించుకుంటూ మొసలికన్నీరు కారుస్తున్నాయని ఆరోపించారు.  ప్రక్షాళనకు అవసరం అయిన నిధులను ప్రభుత్వాలు  మంజూరు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. పోరుయాత్ర వాల్‌రైటింగ్‌ను ఆయన పరిశీలించారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-09T05:37:42+05:30 IST