హనుమకొండలో యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-04-19T15:14:29+05:30 IST
జిల్లాలోని శాయంపేట మండలం మందారిపేట గ్రామంలో పురుగులమందు తాగి సంగీత (28) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.
హనుమకొండ: జిల్లాలోని శాయంపేట మండలం మందారిపేట గ్రామంలో పురుగులమందు తాగి సంగీత (28) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఐసీడీఎస్ గ్రేడ్ 1 సూపర్వైజర్గా సంగీత పనిచేస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.