భార్యకు న్యాయం చేయాలంటూ సెట్‌టవర్ ఎక్కిన భర్త

ABN , First Publish Date - 2022-06-22T15:27:43+05:30 IST

జిల్లాలోని బాలసముద్రంలోని శంకరయ్య అనే వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.

భార్యకు న్యాయం చేయాలంటూ సెట్‌టవర్ ఎక్కిన భర్త

హనుమకొండ: జిల్లాలోని బాలసముద్రంలో శంకరయ్య అనే వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. తన భార్య కవితపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. వారం క్రితం కవితపై ముగ్గురు వ్యక్తులు  దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అయితే ముగ్గురిని అరెస్ట్ చేసి, న్యాయం చేయాలంటూ శంకరయ్య టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శంకరయ్యకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-06-22T15:27:43+05:30 IST