Hanmakondaలో దారుణం

ABN , First Publish Date - 2022-06-06T13:28:59+05:30 IST

జిల్లాలోని భీమదేవరపల్లిలో మండలంలో దారుణం జరిగింది. కన్నకొడుకును తండ్రి గొడ్డలితో నరికిచంపాడు.

Hanmakondaలో దారుణం

హనుమకొండ: జిల్లాలోని భీమదేవరపల్లిలో మండలంలో దారుణం జరిగింది. కన్నకొడుకును తండ్రి  గొడ్డలితో నరికిచంపాడు. కుటుంబకలహాలతో తండ్రి మాచర్ల కుమారస్వామిపై కుమారుడు శ్రీకాంత్(32) గొడ్డలితో దాడి చేశాడు. దీంతో అదే గొడ్డలితో కుమారుడిపై కుమారస్వామి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-06-06T13:28:59+05:30 IST