Eluru: గురవాయిగూడెంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-05-25T14:18:45+05:30 IST

జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో రెండో రోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Eluru: గురవాయిగూడెంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

ఏలూరు: జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో రెండో రోజు  హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి లక్ష తమలపాకులతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ ఈ ఓ కొండలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ కిసరి సరితా రెడ్డి, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T14:18:45+05:30 IST