TS News.. ప్రధాని మోదీ 8 ఏళ్లలో ఒక్క పనీ చేయలేదు: వీహెచ్

ABN , First Publish Date - 2022-08-29T20:25:04+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ 8 ఏళ్లలో ఒక్క పని చేయలేదని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు విమర్శించారు

TS News.. ప్రధాని మోదీ 8 ఏళ్లలో ఒక్క పనీ చేయలేదు: వీహెచ్

హైదరాబాద్ (Hyderabad): కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇస్తలేదని మంత్రి కేటిఆర్ (KTR) అంటున్నారని, రాష్ట్రానికి నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రులు చెప్తున్నారని  కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (Hanumantha Rao) అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) 8 ఏళ్లలో ఒక్క పని చేయలేదని విమర్శించారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలు (Public sectors) అమ్మేస్తున్నారని అన్నారు. ధరల గురించి బండి సంజయ్ (Bandi Sanjay) ఆలోచించాలన్నారు. నూపుర్ శర్మ 9Nupur Sharma), రాజాసింగ్‌ (Rajasingh)లు మహమ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. సెప్టెంబర్ 4న పెరిగిన ధరలపై కాంగ్రెస్ (Congress) పోరాటం చేస్తుందన్నారు. ధరలపై ప్రజల దృష్టిని మరల్చడానికి మత గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించి ముందుకు వెళతామన్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలంటే అందరం కలిసి పని చేయాలని వీహెచ్ సూచించారు.

Updated Date - 2022-08-29T20:25:04+05:30 IST