పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నా..: హరిరామ జోగయ్య

ABN , First Publish Date - 2021-10-03T15:23:29+05:30 IST

పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభ ఆయన రాజకీయ ఎదుగుదలకు నాంది అని...

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నా..: హరిరామ జోగయ్య

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభ ఆయన రాజకీయ ఎదుగుదలకు నాంది అని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వివిధ కులాల కలయికతో రాజ్యాధికారం చేపట్టి ఇందుకు కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరి.. మిగిలిన కులాలను కలుపుకొని పోవాలనే వ్యాఖ్యలను సమర్ధిస్తున్నామన్నారు. దానికి పవన్ సారథ్యం వహించడం స్వాగతిస్తున్నామన్నారు. కమ్మ కులస్థులకు, రెడ్డి కులస్తులు వ్యతిరేకమని, కాపు కులస్తులు కాదని అన్నారు. జనసేన రాజ్యాధికారం దక్కించుకుంటే పరిపాలన ఈ నాటి ప్రభుత్వ పాలనలా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి సాధించే విధంగా ఉంటుందన్నారు. పవన్ ప్రతిపాదనలు ఆహ్వానించదగ్గ విధంగా ఉన్నాయని, జనసేనాని ప్రతిపాదనలను కాపు సంక్షేమ సేన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుందన్నారు. కాపు మంత్రులు పవన్ కళ్యాణ్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. పవన్‌ని అవమానపరచడం అంటే... కాపు సమాజాన్ని అవమానపరచడేమన్నారు. ఇటువంటి చర్యలకు పర్యవసానం 2024 ఎన్నికలలో ముఖ్యమంత్రి చవి చూడవలసి వస్తుందని హరిరామ జోగయ్య హెచ్చరించారు.

Updated Date - 2021-10-03T15:23:29+05:30 IST