రైతుల పక్షాన టీఆర్ఎస్ మహాధర్నా రేపు: హరీష్రావు
ABN , First Publish Date - 2021-11-17T21:23:29+05:30 IST
రైతుల పక్షాన గురువారం టీఆర్ఎస్ మహాధర్నా చేయనున్నట్లు మంత్రి హరీష్రావు తెలిపారు.
హైదరాబాద్: రైతుల పక్షాన గురువారం టీఆర్ఎస్ మహాధర్నా చేయనున్నట్లు మంత్రి హరీష్రావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పంజాబ్లో ఎలా కొంటారు?.. తెలంగాణలో ఎందుకు కొనరు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికో విధానంతో కేంద్రం ఏం చెప్పదల్చుకుందని మంత్రి హరీష్రావు నిలదీశారు.