కుటుంబ రాజకీయాల గురించి మోదీ మాట్లాడటం సిగ్గుచేటు: హరీష్రావు
ABN , First Publish Date - 2022-05-27T00:58:42+05:30 IST
కుటుంబ రాజకీయాల గురించి ప్రధాని మోదీ మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి హరీష్రావు దుయ్యబట్టారు.
హైదరాబాద్: కుటుంబ రాజకీయాల గురించి ప్రధాని మోదీ మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి హరీష్రావు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మోదీ ప్రసంగం బీజేపీ కార్యకర్తలకు నచ్చుతుంది కావొచ్చు. గురివింద గింజ తన నలుపు చూసుకోవాలి. కేంద్రమంత్రి రాజ్నాథ్ కుమారుడు బీజేపీలో లేడా?. యూపీలో పొత్తు పెట్టుకున్న అప్నాదళ్ కుటుంబ పార్టీ కాదా?.. మీ తప్పులు ఎత్తి చూపితే కుటుంబ పార్టీ అంటారు. గతంలో పంజాబ్లో అకాళీదళ్తో అధికారం పంచుకోలేదా?.. మోదీ ఒక వేలు ఎత్తి చూపితే.. నాలుగు వేళ్లు మీవైపే చూపిస్తాయి. కేసీఆర్ది కుటుంబ పార్టీ కాదు.. తెలంగాణే ఓ కుటుంబం. రాష్ట్రాన్ని కుటుంబంగా భావిస్తే పరిపాలించే నాయకుడు కేసీఆర్. అధికారం లాక్కుంటే రాలేదు. ప్రజలే అధికారం ఇచ్చారు’’ అని హరీష్రావు తెలిపారు.