నీతిఆయోగ్ ప్రకటనపై మంత్రి హరీష్‌రావు విమర్శలు

ABN , First Publish Date - 2022-08-07T21:58:52+05:30 IST

నీతిఆయోగ్ ప్రకటనపై మంత్రి హరీష్‌రావు విమర్శలు

నీతిఆయోగ్ ప్రకటనపై మంత్రి హరీష్‌రావు విమర్శలు

హైదరాబాద్‌: నీతిఆయోగ్ ప్రకటనపై మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వంతపాడేలా నీతి ఆయోగ్ ప్రకటన ఉందన్నారు. రూ.24 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తే పైసా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్‌కు ఏం విలువ ఉంది? అని ప్రశ్నించారు. రావాల్సిన నిధుల కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. నీతి ఆయోగ్‌ అసలు రంగును కేసీఆర్‌ బయటపెట్టారని చెప్పారు. నీతి ఆయోగ్‌ రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. 

Updated Date - 2022-08-07T21:58:52+05:30 IST