తెలంగాణలో రేపటి నుంచి ఇంటింటి ఫీవర్ సర్వే: హరీష్రావు
ABN , First Publish Date - 2022-01-20T20:28:36+05:30 IST
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు...
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీష్రావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా లక్షణాలున్నవారికి మెడికల్ కిట్ అందజేస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రులకు పూర్తిస్థాయిలో హోం ఐసొలేషన్, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తామని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు.