హరితం హరం

ABN , First Publish Date - 2021-02-23T04:39:08+05:30 IST

హరితం హరం

హరితం హరం
ధారూరులో చిందరవందరగా పారవేసిన సంచులు, ఎండిన మొక్కలు

హరితహారం మొక్కలు చిందరవందర

సీఎం జన్మదినాన నాటేందుకు తెచ్చిన అధికారులు

ఎండిన మొక్కలు.. పట్టించుకోని వైనం

ధారూరు: సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈనెల 17న నాటేందుకు తెచ్చిన హరితహారం మొక్కలను నాటకుండా చిందరవందరగా పడేశారు. ధారూరు మండల వనరుల కేంద్రం ఆవరణలో  అవి ఎండిపోయి సంచులు చిందరవందరగా పడి ఉన్నాయి. నర్సరీల నుంచి వివిధ రకాల మొక్కలను అధికారులు ఈనెల 17న నాటేందుకు ఇక్కడికి  తీసుకొచ్చారు. వాటిలో నుంచి కొన్ని మొక్కలను తీసుకుపోయి నాటగా, మిగిలిన  మొక్కలు ఎండిపోయాయి. మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలో పడేసిన ఆ మొక్కలను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని  పలువురు విమర్శించారు. ప్రజాధనాన్ని వెచ్చించి నర్సరీలలో కష్టపడి  పెంచిన మొక్కలను  ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడం అధికారుల పనితీరుకు నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-02-23T04:39:08+05:30 IST