దళితులపై ఒక్క కేసు కూడా తీయలేదు: హర్షకుమార్
ABN , First Publish Date - 2020-09-26T21:22:58+05:30 IST
అమరావతి: నేడు హోటల్ ఐలాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్ పాల్గొన్నారు.
అమరావతి: నేడు హోటల్ ఐలాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీరాల కేసులో కిరణ్ కుమార్ తల్లిదండ్రులతో మాట్లాడానన్నారు. ఆ కుటుంబం తరపున కేసు వేశారని లాయర్ శ్రావణ్ తెలిపారన్నారు. చివరకు హియరింగ్కి వచ్చే సమయానికి కేసు ఉపసంహరించుకుంటామన్నారని హర్షకుమార్ తెలిపారు. దీంతో ఆ కేసులో తానే పిల్ వేయాల్సి వచ్చిందన్నారు. తిరుమల సీఎం టూర్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డిల వెనుక నిలుచున్నారని... ఆయనను చూసి ఒక దళితుడిగా తాను జాలిపడుతున్నానన్నారు.
ముస్లిం యువతపై పెట్టిన కేసులు తీసేశారన్నారు. అయితే హైకోర్టు ఆపేసింది.
అయితే దళితులపై ఒక్క కేస్ కూడా తీయలేదన్నారు.