బీజేపీ పొత్తుతో పవన్ ఏం సాధించారు?: హర్షకుమార్

ABN , First Publish Date - 2022-03-15T20:36:16+05:30 IST

బీజేపీ పొత్తుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం సాధించారని హర్షకుమార్ ప్రశ్నించారు.

బీజేపీ పొత్తుతో పవన్ ఏం సాధించారు?: హర్షకుమార్

తూ.గో. జిల్లా: బీజేపీ పొత్తుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం సాధించారని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి కుంటుపడడానికి ప్రధాన కారణం బీజేపీయేనని విమర్శించారు. పవన్ ఏం సాధించారు? ఏం సాధించబోతున్నారు?... పవన్ ప్రసంగం విని జనం నవ్వుకుంటున్నారన్నాని ఎద్దేవా చేశారు. ఏం చేయలేక చంద్రబాబు చతికిలపడ్డారని, ఒక్క చాన్స్ అని చెప్పి జగన్ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమని హర్షకుమార్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-15T20:36:16+05:30 IST