కడసారి చూపునకూ కొట్లాడాల్సిందేనా!

ABN , First Publish Date - 2021-03-01T10:00:45+05:30 IST

సౌదీలోని అల్‌జోఫ్‌ రాష్ట్రంలో ఉన్న ఓ మునిసిపాలిటీలో మెయింటనెన్స్‌ కార్మికుడిగా పని చేసిన నిజామాబాద్‌ జిల్లా సిర్నాపల్లి మండలానికి చెందిన ఒంటరి నర్సారెడ్డి..

కడసారి చూపునకూ కొట్లాడాల్సిందేనా!

3 నెలల తర్వాత స్వదేశానికి మృతదేహం

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సౌదీలోని అల్‌జోఫ్‌ రాష్ట్రంలో ఉన్న ఓ మునిసిపాలిటీలో మెయింటనెన్స్‌ కార్మికుడిగా పని చేసిన నిజామాబాద్‌ జిల్లా సిర్నాపల్లి మండలానికి చెందిన ఒంటరి నర్సారెడ్డి.. మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించారు. మృతదేహాన్ని స్వదేశానికి పంపాలని అతడి కుటుంబం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలి తం లేకపోయింది. హైకోర్టులో పిటిషన్‌ సైతం దాఖలు చేశారు. చివరకు ఆర్మూర్‌లోని ప్రవాసీ సంఘం నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు ద్వారా సౌదీలో పని చేసే తెలంగాణ జాగృతి సంఘం అధ్యక్షుడు మోజ్జం అలీ ఇఫ్తేఖార్‌ను సంప్రందించారు. ఆయన రెండు నెలల పాటు సంప్రదింపులు జరపగా.. ఎట్టకేలకు అక్కడి అధికారులు స్పందించారు. నర్సారెడ్డి మృతదేహాన్ని అల్‌ జోఫ్‌ నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న రియాద్‌కు, అక్కడి నుంచి దుబాయి మీదుగా హైదరాబాద్‌కు పంపించారు.  

Updated Date - 2021-03-01T10:00:45+05:30 IST