మోదీజీ...ఇది చూశారా? వీడియో చూపిన ప్రియాంక
ABN , First Publish Date - 2021-10-05T18:12:57+05:30 IST
ప్రధాని మోదీ మంగళవారం లక్నోలో పర్యటించడానికి కొద్ది గంటలకు ముందే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లఖింపూర్ కేరీ జిల్లాలో..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం లక్నోలో పర్యటించడానికి కొద్ది గంటలకు ముందే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లఖింపూర్ కేరీ జిల్లాలో రైతులపై ఎస్యూవీ దూసుకుపోయిన సంచలన వీడియోను ట్వీట్ చేశారు. ప్రధాని గారూ...ఈ వీడియో చూశారా? అంటూ.. ఆ వైరల్ వీడియోను చూపించారు. ఆ వీడియోను కూడా తన ట్వీట్కు ప్రియాంక జోడించారు.
''నరేంద్ర మోదీ సార్... మీ ప్రభుత్వం నన్ను ఎలాంటి ఉత్తర్వులు చూపకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా 28 గంటలుగా కస్టడీలో ఉంచింది. అన్నదాతలను (రైతులను) తొక్కేసుకుంటూ పోయిన వ్యక్తులను మాత్రం ఇంతవరకూ అరెస్టు చేయలేదు. ఎందుకు?'' అని ప్రియాంక ఆ ట్వీట్లో ప్రశ్నించారు. దీనికి వైరల్ వీడియోను కూడా ఆమె జత చేశారు. రైతులపై ఏస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) దూసుకుపోతుండగా, రైతులు చెల్లాచెదురుగా పరిగెడుతుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది.