పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు
ABN , First Publish Date - 2022-01-27T06:08:22+05:30 IST
పెళ్లి చేసుకుంటానని వంచించి మోసం చేసిన ప్రియుడి ఇంటి వద్ద ఓ యువతి పురుగుల మందు డబ్బాతో ధర్నా చేసింది.
పురుగులమందు డబ్బాతో ప్రియుడి ఇంటి వద్ద ధర్నా
చిన్నకోడూరు, జనవరి 26: పెళ్లి చేసుకుంటానని వంచించి మోసం చేసిన ప్రియుడి ఇంటి వద్ద ఓ యువతి పురుగుల మందు డబ్బాతో ధర్నా చేసింది. బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు పూనుకున్న ఈ సంఘటన చిన్నకోడూరు మండలం రామునిపట్లలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లికి చెందిన పల్లె విద్య, చిన్నకోడూరు మండలం రామునిపట్లకు చెందిన యాసరేణి సంతోష్ కుమార్ (కానిస్టేబుల్) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో గత డిసెంబరులో విద్యకు మరో వ్యక్తితో వివాహం జరిపించారు. అనంతరం ప్రియుడు సంతో్షకుమార్ విద్యకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మబలకడంతో ఆమె గత ఆదివారం సిద్దిపేటకు వచ్చింది. సంతో్షకుమార్ విద్యను కరీంనగర్కు తీసుకు వెళ్లి ఓ అద్దె ఇంట్లో ఉంచి తిరిగి వచ్చాడు. తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతో పాటు, ముఖం చాటేసి ఫోన్ చేసినా స్పందించడంలేదని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ విద్య పురుగుల మందు డబ్బాతో ప్రియుడి ఇంటి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు పూనుకున్నది.