కొవిడ్‌ రోగులకు అండగా హెడ్‌ నర్సు

ABN , First Publish Date - 2021-05-11T03:53:36+05:30 IST

కోటలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్‌ నర్సుగా పనిచేస్తున్న ఏఎం పద్మావతి, ఆమె భర్త ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కమతం విజయకుమార్‌ కొవిడ్‌ రోగులకు అండగా నిలిచారు.

కొవిడ్‌ రోగులకు అండగా హెడ్‌ నర్సు
ఆహారం అందజేస్తున్న హెడ్‌ నర్సు పద్మావతి

కోట, మే 10 : కోటలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్‌ నర్సుగా పనిచేస్తున్న ఏఎం పద్మావతి, ఆమె భర్త ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కమతం విజయకుమార్‌ కొవిడ్‌ రోగులకు అండగా నిలిచారు. ఈ సెంటర్‌లో చికిత్స పొందే బాధితులకు మూడు పూటలా ఆహారంతోపాటు పండ్లు, పాలు ఉచితంగా అందజేస్తున్నారు.  ఇక్కడ కొవిడ్‌ సెంటర్‌ ఉన్నంతకాలం తమ సహకారం ఉంటుందని తెలిపారు.  సోమవారం ఆహారం, రొట్టెలు, పండ్లు, పాలు అందజేశారు. ఈ దంపతులను  వైద్య ఆరోగ్య సిబ్బంది అభినందించారు.

Updated Date - 2021-05-11T03:53:36+05:30 IST