కొవిడ్ రోగులకు అండగా హెడ్ నర్సు
ABN , First Publish Date - 2021-05-11T03:53:36+05:30 IST
కోటలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న ఏఎం పద్మావతి, ఆమె భర్త ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కమతం విజయకుమార్ కొవిడ్ రోగులకు అండగా నిలిచారు.
కోట, మే 10 : కోటలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న ఏఎం పద్మావతి, ఆమె భర్త ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కమతం విజయకుమార్ కొవిడ్ రోగులకు అండగా నిలిచారు. ఈ సెంటర్లో చికిత్స పొందే బాధితులకు మూడు పూటలా ఆహారంతోపాటు పండ్లు, పాలు ఉచితంగా అందజేస్తున్నారు. ఇక్కడ కొవిడ్ సెంటర్ ఉన్నంతకాలం తమ సహకారం ఉంటుందని తెలిపారు. సోమవారం ఆహారం, రొట్టెలు, పండ్లు, పాలు అందజేశారు. ఈ దంపతులను వైద్య ఆరోగ్య సిబ్బంది అభినందించారు.