తెలంగాణలో కోవిడ్ నియంత్రణలో ఉంది: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
ABN , First Publish Date - 2020-12-02T20:53:15+05:30 IST
రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ రేటు ఒక శాతం ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ రేటు ఒక శాతం ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొత్తం మీద 3.4 శాతం కరోనా యాక్టివ్ కేసుల రేట్ ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ నియంత్రణలో ఉందన్నారు.
కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలంతా వచ్చే వారం రోజులు ఐసోలేషన్లో ఉండాలని శ్రీనివాసరావు సూచించారు. ఇంకా 50 శాతం పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. 300 మొబైల్ టెస్టింగ్ వ్యాన్ల ద్వారా టెస్ట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల తర్వాత కరోనా కేసుల పెరుదల గమనించేందుకు వారం రోజులు పడుతుందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.