ధరల పెరుగుదలతో ప్రజలపై పెనుభారం
ABN , First Publish Date - 2022-05-16T05:17:41+05:30 IST
ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విద్యుత్, బస్ చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని టీడీపీ నేతలు ధ్వజ మెత్తారు.
వైసీపీ పాలనలో బాదుడే బాదుడు
టీడీపీ నేతల ధ్వజం
పంగులూరు, మే 15: ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విద్యుత్, బస్ చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని టీడీపీ నేతలు ధ్వజ మెత్తారు. ఆదివారం సాయంత్రం మండలంలోని క శ్యాపురం, రేణంగివరం గ్రామాలలో బాదుడే బాదు డు కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ చార్జీలను పెంచడంతోపాటు పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటినా పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. పెరిగిన ధరలను తెలియచేస్తూ మహిళలకు కరపత్రాలు పంపిణీ చేశారు. కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షు డు రావూరి రమే ష్, మాజీ జడ్పీటీ సీ కేవీ సుబ్బా రావు, కుక్కపల్లి ఏ డుకొండలు, చిం తల పహదేవుడు, మస్తాన్వలి, మా జీ సర్పంచ్ అమృ తపూడి ఏసోబు (చిన్నా), నాగిరెడ్డి, బత్తుల వెంకటరావు, చల్లగుండ్ల కోటేశ్వరరావు, గుడిపాటి ఆదిరెడ్డి, సుబ్బారెడ్డి, బొప్పూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.