భారీగా కరెంట్ చార్జీల బాదుడు!
ABN , First Publish Date - 2022-03-08T08:26:48+05:30 IST
కరెంట్ చార్జీల బాదుడు ఖాయంగా కనిపిస్తోంది.
డిస్కమ్లకు సబ్సిడీలు పెంచని ప్రభుత్వం
హైదరాబాద్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కరెంట్ చార్జీల బాదుడు ఖాయంగా కనిపిస్తోంది. బడ్జెట్లో వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేటాయింపులు లేకపోవడంతో డిస్కమ్లు భారీ బాదుడుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారులకు యూనిట్కు 50 పైసలు, లోటెన్షన్లో గృహేతర, హైటెన్షన్ వినియోగదారులకుయూనిట్కు రూ.1లు పెంచాలని డిస్కమ్లు నిర్ణయించారు. చార్జీలపెంపు రూపం లో రూ.6,831 కోట్లను వసూలు చేసుకోవాలని డిస్కమ్లు ఏఆర్ఆర్/టారిఫ్ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలిలో సమర్పించిన విషయం విదితమే. నేడో రేపో కరెంటు చార్జీల పెంపు కోసం ఈఆర్సీ ఉత్తర్వులు ఇవ్వనుంది. రూ. 6 వేల కోట్లపైన కరెంట్ చార్జీల పెంపు భారం ఉండనుంది. డిస్కమ్లు భారీగా చార్జీల పెంపునకు నిర్ణయం తీసుకోగా.. ఆ మేరకు భారం ఉండదని, చార్జీలు భారీగా పెంచకుండా ప్రభుత్వం సబ్సిడీ పెంచుతుందని అంతా భావించారు. ఇంతలో ఒక్కరూపాయి కూడా సబ్సిడీ పెంచేది లేదని బడ్జెట్లో తేలిపోయింది. మరోవైపు వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేయడానికి అయ్యే వ్యయం భారీగా పెరుగుతున్నా.. ఆ మేరకు సబ్సిడీలు పెంచకపోవడంతో డిస్కమ్లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోనున్నాయి.