Crops: వర్షాలకు నీటమునిగిన పంటలు

ABN , First Publish Date - 2022-08-30T15:57:12+05:30 IST

డెల్టా జిల్లాల్లో కురస్తున్న వర్షాల కారణంగా పంటలు నీటమునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తంజావూరు(Thanjavur), తిరువారూరు,

Crops: వర్షాలకు నీటమునిగిన పంటలు

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 29: డెల్టా జిల్లాల్లో కురస్తున్న వర్షాల కారణంగా పంటలు నీటమునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తంజావూరు(Thanjavur), తిరువారూరు, నాగపట్టణం, మైలాడుదురై సహా 12 డెల్టా జిల్లాల్లో రెండు వారాలకు పైగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం స్వల్ప వర్షంగా ప్రారంభమైన భారీ వర్షం(heavy rain)గా మారి సుమారు గంటన్నర సేపు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో తంజావూరు(Thanjavur) జిల్లా తిరుకాట్టుపల్లి, కురుంగుళం, బూదలూరు, పాపనాశం, మైలాదురై జిల్లా శీర్గాళి, కుత్తాలం, మాప్పడుగై సహా పలు జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పలు ఎకరాల వరి పంట నీటమునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కురువై సాగుకు రాష్ట్రప్రభుత్వం బీమా ప్రకటించిన పోవడంతో ఆందోళన చెందుతున్న రైతులు, తగిన పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2022-08-30T15:57:12+05:30 IST