ఊటీలో కుంభవృష్టి
ABN , First Publish Date - 2022-07-21T16:35:09+05:30 IST
నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉపరితల ద్రోణి కారణంగా నీలగిరి, కోవై సహా ఐదు జిల్లాల్లో
పెరంబూర్(చెన్నై), జూలై 20: నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉపరితల ద్రోణి కారణంగా నీలగిరి, కోవై సహా ఐదు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీవర్షానికి ఊటీలోని పలు రోడ్లపై వరద నీరు ప్రవహించింది. దీంతో రాష్ట్ర విపత్తుల నివారణ బృందానికి చెందిన 170 మంది సభ్యులు ఊటీలో విధుల్లో అప్రమత్తంగా ఉన్నారు.