స్వీటీ అనుష్క, విలక్షణ నటుడు మాధవన్లతో దర్శకుడు హేమంత్ మధుకర్ రూపొందించిన 'నిశ్శబ్దం' చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదలైన విషయం తెలిసిందే. టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో రూపొందిన ఈ చిత్రానికి రివ్యూల పరంగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వ్యూవర్స్ పరంగా మాత్రం బిగ్ హిట్ అందుకున్నట్లుగా రిపోర్ట్స్ వచ్చాయి. ఇక ఈ చిత్రం తర్వాత హేమంత్ మధుకర్ రెండు బిగ్ ప్రాజెక్ట్స్తో రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి యాక్షన్ రొమాంటిక్ చిత్రం కాగా.. ఈ చిత్రానికి రచయిత గోపీమోహన్ స్ర్కీన్ప్లే అందిస్తున్నారట. ఈ చిత్రం కూడా 'నిశ్శబ్దం' చిత్రాన్ని రూపొందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మించనుందని టాక్ నడుస్తోంది.
ఇక హేమంత్ మరో చిత్ర విషయానికి వస్తే.. ఇది బాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రంగా రూపొందనుందట. బాలీవుడ్లో 'ఏ ఫ్లాట్' అనే చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న హేమంత్ మధుకర్ ఇప్పుడు 'బాతే' అనే టైటిల్తో మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి 'కహానీ, పింక్' చిత్రాల రచయిత రితేష్ షా స్ర్కీన్ప్లే అందించనున్నారని, ఈ చిత్రం 70 శాతం షూటింగ్ లండన్లో జరగనుందని వార్తలు వినవస్తున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.