ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన బాస్! ఒక్కొక్కరికీ బోనస్‌గా రూ.74 వేలు! ఎందుకో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-04-06T01:43:07+05:30 IST

డబ్బులు చాలక అవస్థలు పడుతున్న తన ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడో బాస్. ఒక్కొక్కరికీ రూ. 74 వేలు చేతిలో పెట్టేసరికి వారికి నోట మాట రాలేదు.

ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన బాస్! ఒక్కొక్కరికీ బోనస్‌గా రూ.74 వేలు! ఎందుకో తెలిస్తే..

ఎన్నారై డెస్క్: డబ్బులు చాలక అవస్థలు పడుతున్న తన ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడో బాస్. ఒక్కొక్కరికీ రూ. 74 వేలు చేతిలో పెట్టేసరికి వారికి నోట మాట రాలేదు. అకస్మాత్తుగా ఉద్యోగులను తొలగించే కంపెనీలున్న ఈ రోజుల్లో ఇటువంటి బాస్‌లు కూడా ఉంటారా అనిపించేలా సర్‌ప్రైజ్ చేశాడు ఆ బాస్! బ్రిటన్‌లో ఇటీవల జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మా దేశంలో ఇతడే బెస్ట్ బాస్ అంటూ అక్కడి నెటిజన్లు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఎమిరిస్ టింబర్ అండ్ బిల్డర్స్ మర్చెంట్స్ అనే కంపెనీకి జేమ్స్ హిప్కిన్స్ మనేజింగ్ డైరెక్టర్! ఆయన వద్ద 60 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో ఇటీవల కాలంలో ప్రజలపై ధరల భారం బాగా పెరిగిపోయింది. కరెంటు ఖర్చులు, పన్నులు, పెట్రోల్ ఖర్చులు ఇలా అన్నిటి ధరలూ పెరిగి ప్రజలు ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు. ఈ కష్టకాలంలో తన ఉద్యోగుల అవస్థలను అర్థం చేసుకున్న జేమ్స్.. ఇంటి ఖర్చులకంటూ ఇటీవల ఒక్కొక్కరికీ 750 పౌండ్లను(సుమారు రూ. 74 వేలు) బోనస్‌గా ప్రకటించారు. దీంతో.. వాళ్లు ఉబ్బితబ్బిబ్బైపోయారు. ‘‘ప్రతి ఒక్కరూ ధరల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి. కంపెనీ లాభాల్లో కొంత మొత్తాన్ని వారికి ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఇలాంటి బోనస్ వస్తుందని వారు ఊహించక పోవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు’’ అని జేమ్స్ స్థానిక మీడియాతో తెలిపారు. 

Updated Date - 2022-04-06T01:43:07+05:30 IST