‘హిజాబ్‌’ జడ్జీలకు ‘వై’ కేటగిరీ భద్రత

ABN , First Publish Date - 2022-03-21T08:05:22+05:30 IST

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురు జడ్జీలకు కర్ణాటక ప్రభుత్వం వై..

‘హిజాబ్‌’ జడ్జీలకు ‘వై’ కేటగిరీ భద్రత

బెంగళూరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురు జడ్జీలకు కర్ణాటక ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదివారం బెంగళూరులో మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. తీర్పు అనంతరం న్యాయమూర్తులను చంపేస్తామని బెదిరించిన వ్యక్తిపై తమిళనాడులో ఇప్పటికే కేసు నమోదైందని, కర్ణాటక హైకోర్టు బార్‌కౌన్సిల్‌ ఫిర్యాదు మేరకు విధానసౌధ పోలీసులు కూడా కేసు నమోదు చేశారని సీఎం చెప్పారు. 

Updated Date - 2022-03-21T08:05:22+05:30 IST