నెల్లూరు వైసీపీ వివాదంపై హైకమాండ్ దృష్టి
ABN , First Publish Date - 2022-04-16T22:33:16+05:30 IST
నెల్లూరు వైసీపీ వివాదంపై హైకమాండ్ దృష్టి సారించింది. మాజీమంత్రి అనిల్కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డిలతో మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి: నెల్లూరు వైసీపీ వివాదంపై హైకమాండ్ దృష్టి సారించింది. మాజీమంత్రి అనిల్కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డిలతో మంత్రి బొత్స సత్యనారాయణ మంతనాలు జరుపుతున్నారు. అధిష్ఠానం సూచనతో ఇరువురు నేతలతో బొత్స మాట్లాడారు. తాను ముందుగానే కార్యక్రమం ఏర్పాటు చేశానని అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. వివాదాల జోలికి వెళ్లవద్దని ఇరువురు నేతలకు బొత్స సూచించారు. నెల్లూరు వ్యవహారంపై సీఎం జగన్కు పార్టీ నేతలు వివరించనున్నారు.