సాహస కమాండోకు ఇదేనా ప్రభుత్వ గుర్తింపు?

ABN , First Publish Date - 2021-04-23T09:52:57+05:30 IST

దేశరక్షణ కోసం పనిచేస్తూ తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఎన్‌ఎస్జీ కమాండో కనగాల శ్రీరాములు త్యాగానికి ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు ఇదేనా...

సాహస కమాండోకు ఇదేనా ప్రభుత్వ గుర్తింపు?

శ్రీరాములు ఇంటి నిర్మాణానికి వెంటనే నిధులివ్వాలి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): దేశరక్షణ కోసం పనిచేస్తూ తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఎన్‌ఎస్జీ కమాండో కనగాల శ్రీరాములు త్యాగానికి ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు ఇదేనా...అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘కమాండో కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిదని, ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టించే యోచన చేస్తున్నట్లు 2018 అక్టోబరు 30న ఏజీ ఈ కోర్టుకు హామీ ఇచ్చారు.


ఇంతవరకు ఇంటి నిర్మాణానికి నిధు ఎందుకు కేటాయించలేదు’’అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి కమాండో శ్రీరాములు ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయని పక్షంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈమేరకు  గురువారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జూన్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. 

Updated Date - 2021-04-23T09:52:57+05:30 IST