దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-08-18T20:40:52+05:30 IST

వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌ సంస్థ దళిత బంధుపై హైకోర్టులో పిల్‌పై వేసింది.

దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌ సంస్థ దళిత బంధుపై హైకోర్టులో పిల్‌పై వేసింది. బుధవారం ఈ పిల్‌పై న్యాయస్థానం వాదనలు వినింది. నిబంధనలు ఖరారు చేయకుండానే నిధులు విడుదల చేశారని కోర్టు దృష్టికి పిటిషనర్‌ తెచ్చారు. నిబంధనలు ఖరారు చేసినట్లు హైకోర్టుకు అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపారు. దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు పథకం వర్తిస్తుందని అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపారు. నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్‌సైట్‌లో లేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. జీవోలు ప్రజల మందు ఉంచడానికి ఉన్న ఇబ్బందేంటని హైకోర్టు ప్రశ్నించింది. అడ్వొకేట్‌ జనరల్‌ వివరణను కోర్టు నమోదు చేసుకుంది. జీవోలన్నీ 24 గంటల్లో వెబ్‌సైట్‌లో పెట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-08-18T20:40:52+05:30 IST