High Court: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై విచారణ
ABN , First Publish Date - 2022-09-07T04:12:07+05:30 IST
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ జరిగింది. చెన్నమనేని రమేష్ తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ కోర్టులను..
హైదరాబాద్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ (Mla Chennamaneni Ramesh) పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని రమేష్ తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ కోర్టులను, ప్రజలను మోసం చేస్తున్నారని పిటిషనర్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపున లాయర్ రవి కిరణ్రావు (Advocate Ravi Kiran Rao) వాదనలు వినిపించారు. చిన్నమనేని పౌరసత్వం రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇప్పటికీ చెన్నమనేని జర్మనీ (Germany) పౌరసత్వం కలిగి ఉన్నారని తెలిపారు. చెన్నమనేని జర్మనీలో రిటైర్డ్ ప్రొఫెసర్గా చెప్పుకుంటూ ఇండియాలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భారతీయ పౌరుడు కాకుండానే ఎన్నికల్లో పోటీ చేశారని లాయర్ వాదించారు. దీంతో చెన్నమనేనికి అసలు వీసాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.