చిలకలూరిపేటలో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా
ABN , First Publish Date - 2021-03-09T21:20:41+05:30 IST
గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో జరిగే మున్సిపల్
అమరావతి: గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. అయితే ఎన్నికల ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపు యథావిధిగా ఎన్నికలు జరుగనున్నాయి. పసుమర్రు, గణపవరాన్ని చిలకలూరిపేట పురపాలకలో కలుపడంపై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 15, 16కు హైకోర్టు వాయిదా వేసింది.