రాఘవేంద్రుడి సన్నిధిలో హైకోర్టు జడ్జి
ABN , First Publish Date - 2021-11-28T05:47:28+05:30 IST
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గంగారావు శనివారం మంత్రాలయం వచ్చారు.
మంత్రాలయం, నవంబరు 27: రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గంగారావు శనివారం మంత్రాలయం వచ్చారు. ఈయనకు సుజయీంద్ర ఏసీ అతిథి గృహం వద్ద ఎమ్మిగనూరు జడ్జి గురుఅరవింద్ ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్కుమార్, మంత్రాలయం సీఐ భాస్కర్, శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తిలు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం శ్రీమఠం ముఖద్వారం వద్ద వేదపండితులు స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామిని దర్శించుకొని హారతులు ఇచ్చారు. వేదపండితులు మెమొంటో, శేషవస్త్రం, ఫల, ఫుష్ప మంత్రాక్షితలతో ఆశీర్వదించారు. అలాగే కర్ణాటకకు చెందిన బళ్లారి మాజీ ఎంపీ, శ్రీమఠం శిలామండపం దాత సూర్యనారాయణరెడ్డి గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, బిందుమాధవ్, వ్యాసరాజ్ ఆచార్, ఆర్ఐ ఆదాము, వీఆర్వో భీమన్న గౌడ్ పాల్గొన్నారు.