కొండపల్లి ఎన్నిక వాయిదాపై ఏపీ హైకోర్టు సీరియస్
ABN , First Publish Date - 2021-11-23T19:17:14+05:30 IST
కొండపల్లి ఎన్నిక వాయిదాపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాడీవేడీ వాదనలు కొనసాగాయి.
అమరావతి : కొండపల్లి ఎన్నిక వాయిదాపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాడీవేడీ వాదనలు కొనసాగాయి. మధ్నాహ్నం 2:15 గంటలకు విజయవాడ సీపీ.. కొండపల్లి మున్సిపల్ కమిషనర్ హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. నిన్న, ఈరోజు వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. కావాలనే ఎన్నిక వాయిదా వేశారని న్యాయవాది అశ్వినీకుమార్ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశించినా ఎన్నిక నిర్వహించలేదని అశ్వినీకుమార్ పేర్కొన్నారు. ఎన్నిక ఎందుకు నిర్వహించలేకపోయారని హైకోర్టు నిలదీసింది. మధ్యాహ్నం హైకోర్టు ముందు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.