ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
ABN , First Publish Date - 2021-12-02T02:57:59+05:30 IST
ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణపై విచారణను హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులపై..
అమరావతి: ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణపై విచారణను హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు సంబంధించి దాఖలైన వ్యాఖ్యాలను పరిశీలించి సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులు ఉపసంహరణకు సంబంధించి హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు వచ్చిన ప్రతిపాదనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.