దలితబంధు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన High court

ABN , First Publish Date - 2021-10-25T18:01:22+05:30 IST

దళిత బంధు పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.

దలితబంధు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన High court

హైదరాబాద్: దళిత బంధు పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. దళిత బంధువును ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో నాలుగు పిటీషన్‌లు దాఖలయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటీషనర్లు పేర్కొన్నారు. ఒక్క హుజురాబాద్‌లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అమలవుతుందని కోర్టుకు పిటిషనర్లు తెలియజేశారు. 


కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్ అబ్యాన్ కొనసాగించే విధంగానే దళిత బంధువు పథకాన్ని కూడా కొనసాగించాలని కోరారు. దళిత బంధు పథకాన్ని ఆపడం వలన చాలామంది వెనుకబడిన వారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని ఇప్పుడు ఎన్నికల సంఘం ఆపడం సరైంది కాదని తెలిపారు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసిన దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పిటిషన్లను కోరారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 

Updated Date - 2021-10-25T18:01:22+05:30 IST