సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం

ABN , First Publish Date - 2021-07-04T03:35:08+05:30 IST

కృష్ణా జలాల వినియోగంపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం

 హైదరాబాద్‌: కృష్ణా జలాల వినియోగంపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆంధ్రా -తెలంగాణ నడుమ ఇప్పటిదాకా తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగాన్ని సమావేశం తిరస్కరించింది. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలంది. కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీల నికర జలాల కేటాయింపుల్లో చెరి సగం 405.5 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపేదాకా వినియోగించుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 

Updated Date - 2021-07-04T03:35:08+05:30 IST