అమాంతం పెరిగిపోయిన వంటనూనెల ధరలు

ABN , First Publish Date - 2022-03-01T18:30:07+05:30 IST

ఎక్కడ ఏం జరిగినా.. ముండుగా భారం పడేది మాత్రం మన వంటింటిపైనే. కరోనా వచ్చినా, పెట్రోల్ ధరలు పెరిగినా...

అమాంతం పెరిగిపోయిన వంటనూనెల ధరలు

ఇంటర్‌నెట్ డెస్క్: ఎక్కడ ఏం జరిగినా.. ముండుగా భారం పడేది మాత్రం మన వంటింటిపైనే. కరోనా వచ్చినా, పెట్రోల్ ధరలు పెరిగినా, ఎక్కడ ఏ ఉపద్రవం ముంచుకొచ్చినా వంటింటి సరుకుల ధరలు ఆకాశన్నంటుతాయి. ఈ క్రమంలోనే.. ఇప్పుడు జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సెగలు మన వంటింటిని తాకాయి. వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. నిన్నటి ధర నేడు లేదు. ఇక రేపటి పరిస్థితి ఊహకు అందడంలేదు. మొత్తం మీద అంతా గందరగోళం. విజయా బ్రాండ్ పేరుతో సమాఖ్య వంట నూనెలను ప్రజలకు విక్రయించే ఆయిల్ ధరలు నెల రోజుల వ్యవధిలో లీటరు పామాయిల్ ధరను రూ. 29 పెంచింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదించింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి దిగుమతి అవుతున్న పొద్దుతిరుగుడు నూనె ధర కూడా చక చకా పెరుగుతోంది. భారత్‌లో వినియోగించే వంట నూనెల్లో 70 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెలు అయితే 90 శాతం ఇతర దేశాల నుంచే వస్తున్నాయి.

Updated Date - 2022-03-01T18:30:07+05:30 IST